కేటీఆర్ మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడు అని చెప్పవచ్చు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. కేటీఆర్ ఎప్పడూ మాట్లాడిన పద్దితిగా మాట్లాడతాడు ఎప్పడూ నోరు జారీ ఎదో మాట్లాడ బోయి ఇంకొకటి మాట్లాడే రకం కాదు. అయితే కేటీఆర్ ఒక సభలో తెలంగాణ యూత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. తెలంగాణ యువతకు పనిచేసే అలవాటు లేదని.. కించపరుస్తున్నట్లుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Image result for ktr images

అందులో ఆయన ‘‘నాతోపాటూ హైదరాబాదు రండి.. బోలెడు బిల్డింగులు కడుతున్నారు.. అందులో పనిచేస్తున్న వాళ్లు మనోళ్లు సగం మంది కూడా లేరు. ఎందుకంటే.. మనోళ్లు ఇక్కడ వొళ్లు వంచరు. ఇక్కడ వొళ్లు వంచాలంటే నామోషీ. దుబాయికి, బొంబాయికి బొయి అక్కడ ఎనిమిది వేలు, పదివేలు యిస్తే పనిజేస్తరు... ‘‘మంత్రి వచ్చినప్పుడు దరకాస్తులు యివ్వడం వేరు. మనోళ్లకి వొళ్లొంచి పనిచేయాలనే సోయి ఉండడం వేరు..’’ అంటూ మాట్లాడారు.

Image result for ktr images

చిన్న స్థాయి ఉద్యోగాల కల్పన తెలంగాణలో చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నదని..కాకపోతే.. తెలంగాణ యువతే పనిచేయడానికి చాలినంతగా ముందుకు రావడం లేదని.. చెప్పే ఉద్దేశంతో కేటీఆర్ ఈ మాటలు అన్నారు. అయితే.. ఈ మాటలు యావత్ తెలంగాణ యువత లక్షణంగా అభివర్ణిస్తున్నట్లుగా ఉన్నాయి. పనిచేయకుండా బద్ధకిస్తున్న వాళ్లు ఖచ్చితంగా కొంతమంది ఉండొచ్చు. అంతమాత్రాన.. కొందరిలో ఉండే అలాంటి లక్షణాన్ని యావత్ తెలంగాణ జాతికి ఆపాదిస్తూ బాధ్యతాయుతమైన మంత్రి మాట్లాడడం కరెక్టు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: