సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంత సేపూ తన గొప్పలు చెప్పుకోవడమే తప్ప జనానికి చేసేదేమిటో చెప్పడం లేదంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. సొంత డబ్బా ఆపి విషయంలోకి రావాలంటూ సూచన కూడా చేశారు. పవన్ రాజకీయంగా ఇంకా ఎదగాలని కూడా వ్యంగ్యంగా కోరుకున్నారు.  ఇంతవరకు   పవన్ పట్ల‌  సాఫ్ట్ కార్నెర్ తో వున్న గంటా ఇలా  సడన్ గా
 హాట్ కామెంట్స్ చేసేసి ఒక్కసారిగా అందరినీ తన వైపు తిప్పుకున్నారు, 


బురద జల్లుడేనా :


ఎపుడు చూసినా టీడీపీ మీదనే పవన్ విరుచుకుపడుతున్నారుట. పక్కనున్న జగన్ పార్టీని కనీసం ఏం అనడం లేదుట. అంతేనా పవన్ మోడీ డైరెక్షన్లో సూపర్ గా  యాక్ట్ చేస్తున్నారుట. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదివేస్తున్నారుట.  పవన్ ఉత్తరాంధ్రా  టూర్ మొత్తం అయిపోయాక గంటా వారికి కనిపించిన నిజాలు ఇవేనట. 


అది కనిపించదా :


తెలుగుదేశం సర్కార్ రైతు రుణ మాఫీగా పాతిక వేల కోట్ల రూపాయలను ఇచ్చిన సంగతి పవన్ కు కనిపించదా అని గంటా అంటున్నారు. లోటు బడ్జెట్లో  ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా చేస్తున్న సంగతీ తెలియదా అని నిలదీస్తున్నారు. ఏపీలో వ్రుధ్ధి రేట్ పెరుగుదల, వేగంగా సాగుతున్న అభివ్రుధ్ధి ఇవేమీ పట్టదా అంటూ కౌంటర్లేశారు


అంత బాగా నచ్చెశాడా :


విభజన ద్వారా ఎంతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన మోదీ ప్రభుత్వం ఏం చెయకపోయినా కూడా పవన్ కు ఎందుకు అంతలా నచ్చెశాడో చెప్పాలట. రాజధానికి నిధులు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా ప్రకటించకపొయినా, విశాఖ రైల్వే జోన్ ని పక్కన పెట్టేసినా కూడా మోదీ ని పల్లెత్తు మాట పవన్ అనకపోవడమేంటని గంటా అంటున్నారు. ఇక జగన్ అవినీతి కేసులు సైతం కనిపించకుండా పోయాయా, వైసీపీతో ఏం పొత్తులు ఎత్తులు ఉన్నాయో కూడా పవన్ సెలవీయాలట. మొత్తానికి పవన్ ఊరు దాటాక కానీ మంత్రి గారికి ఆయన గారి తప్పులు కనిపించలేదా అని సెట్టైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: