ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహం పన్నుతున్నాయి. ఇక జంప్ జలానీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ చల్లగుంటే..ఆ పార్టీలో అన్నట్లు అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకులు బాగానే వలస వచ్చారు. తాజాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూల ఇస్తూ.. కర్నూలు ప్రాంతంలోని క్షేత్ర స్థాయి నేతలు, కార్యకర్తలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, మరోసారి గెలిచి ఇక్కడి ప్రజలకు సేవ చేసుకుంటానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఆపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆమె వైఎస్ జగన్ కు, ఆయన పార్టీకి ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైసీపీ తరుపు నంచి గెలిచిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని..కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీకి దూరమయ్యానని ఆమె వెల్లడించారు.
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్రం ఎంతో అన్యాయం చేసిందన్న ఆవేదనను వ్యక్తం చేసిన ఆమె, విశాఖపట్నానికి రైల్వే జోన్ విషయంలోనూ అదే వైఖరిని అవలంబించిందని విమర్శించారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని బుట్టా రేణుక వ్యక్తం చేశారు.