కాదేదీ కవితకు అనర్హం..అన్నారు కవులు..కాదేదీ కేసుకు అనర్హం అంటున్నారు అక్కడి పోలీసులు.  అవును..సాధారణంగా పోలీసులు నేరస్థులపై కేసులు నమోదు చేస్తుంటారు..అప్పుడప్పుడు వింతగా జంతువులపై..పక్షులపై కేసులు నమోదు అయ్యాయని వార్తలు వింటూనే ఉన్నాం.  తాజాగా ఒప్పుడు దెయ్యంపై కేసు నమోదు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు గుజరాత్ పోలీసులు.
Gujarat Police Files Complaint Against 'Unknown Ghost' In Suicide Case
గుజ‌రాత్‌లోని వ‌డోద‌రా జిల్లాలో పోలీసులు ఓ అప‌రిచిత దెయ్యంపై కేసు న‌మోదు చేశారు. చోకారీ అనే గ్రామంలో ఓ మ‌హిళ కిరోసిన్ పోసుకుని నిప్ప‌టించుకుంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. స‌కాలంలో వ‌చ్చిన కుటుంబ స‌భ్యులు ఆమెను కాపాడ‌గ‌లిగారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు విని పోలీసులు షాక్ కి గురయ్యారు. 

తనను కొంత కాలంగా ఓ దెయ్యం వేదిస్తుందని...ఆ దెయ్యం ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాన‌ని ఆమె తెలిపింది. ఇదే విషయాన్ని చుట్టుపక్కల వారికి కూడా చెప్పినట్లు అత్తమామలు అంటున్నారు.  కానీ మనీషా తండ్రి మాత్రం ఇది ముమ్మాటికి అత్తింటి వేధింపులే కారణం అని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: