చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వీరుడట. అన్నం పెట్టిన చేయిని నరికే నైజమట. సాయం చేసిన వాళ్ళనే మోసం చేస్టాడట. ఇన్ని రకాలుగా తిట్లు తిట్టింది ఎవరో కాదు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. విశాఖ మీడియాతో ఈ రోజు ఆయన మాట్లాడుతూ బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా నిధులు ఖర్చు చేస్తూ మళ్ళీ మాపైనే బురద జల్లడం బాబుకే చెల్లిందంటూ గుస్సా అయ్యారు. అభివ్రుధ్ధి అంటే ఏంటో ఏపీలో నాలుగేళ్ళలో చేసి చూపించామని చెప్పుకున్నారు.
మోదీని తిట్టడమే మ్యానిఫేస్టోట :
మోదీని తిట్టడమే బాబు ఎన్నికల మ్యానిఫేస్టో అన్నారు కన్నా. ఉన్నవీ లేనివీ మొత్తం హామీలన్నీ బాబు 2014 లో గుప్పించి అధికారంలోకి వచ్చేశాడని, ఇంక చెప్పేందుకు ఏమీ లేకనే బీజేపీ మీద పడుతున్నాడని కన్న ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బాబుకు నమ్మించి మోసం చేయడం బాగా అబ్బిన విద్య అంటూ సెటైర్లు వేశారు. ఆయనకు కావల్సింది రాజకీయం, ఓట్లు తప్ప ప్రజల అభివ్రుధ్ధి కానే కాదని తేల్చేశారు.
అవి రావడం ఇష్టం లేదట :
పేరుకే ఉద్యమాలు చేయిస్తున్నా బాబుకు కడప ఉక్కు ఫ్యాక్టరీ రావడం అసలు ఇష్టం లేదని కన్నా కామెంట్స్ చేశారు. అలాగే దుగరాజపట్నం పోర్ట్ కూడా బాబుకు ఇష్టం లేదని, కేంద్రం అడిగిన ఏ వివరాలు ఇంతవరకూ ఇవ్వకపోవడమే ఇందుకు సాక్ష్యం అంటున్నారు. పైకి మాత్రం ఏమీ చేయడం లేదంటూ కేంద్రంపై నిందలు వేస్తున్నారని కన్నా కౌంటర్లేశారు.
రైల్వే జోన్ వస్తుందట :
రైల్వే జోన్ వస్తుందని మరో మారు కన్న రొటీన్ డైలాగ్ చెప్పారు. పోలవరంలో భారీ అవినీతి జరిగిపోతోందని, టీడీపీ భాగోతాలు బయటేస్తామని కన్న వార్నింగులు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఆరు వేల కోట్లతో అభివ్రుధ్ధి పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రేపు ప్రారంభిస్తారని, గుంటూరుకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రేపు వస్తున్నారని, ఇవన్నీ ఏపీ కోసం కాదా అంటూ కన్నా టీడీపీని నిలదీశారు.