అనంతపురం జిల్లా తాడిపత్రికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గెరుడౌ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన కర్మాగార సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై, మృతుల వివరాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఈ సంఘటన ఎలా జరిగిందన్నవిషయంపై ఇంకా సరైన స్పష్టత రాలేదు.
యాజమాన్యం కర్మాగారంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధితకుటుంబాలను ఆదుకోవాలని కర్మాగారంలో రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.