మరోపక్క వస్తున్నా ఎన్నికలలో చాలామంది ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపద్యంలో ప్రస్తుతమున్న ఓట్లు చీలిపోతే కచ్చితంగా వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో కూడా చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే గనుక నారా లోకేష్ భవిష్యత్తుకి ఎటువంటి తోక ఉండదు అనేది చంద్రబాబు అభిప్రాయం.
ఇదిలా ఉండగా ఇటీవల తాజాగా గ్రౌండ్ లెవెల్ లో చేసిన స్టడీ రిపోర్ట్ మాత్రం చంద్రబాబు కు షాకింగ్ రిసల్ట్ ఇచ్చింది . ఎందుకంటే పవన్, జేడీ, బీజేపీ ఇలా పార్టీలన్నీ కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ కి పడిన ఓట్లని చీలుస్తాయని ఆ స్టడీ తేల్చి చెప్పిందట.
అయితే గ్రౌండ్ లెవెల్ లో వైకాపా కు టీడీపీ కంటే ఏడు శాతం ఓట్ల మార్జిన్ ఆధిక్యం ఉందని తాజాగా స్థానిక ఎన్నికల సంస్థ చేసిన సర్వే లో బయట పడింది. గతంలో 2014లో ఇదే సంస్థ మోడీ ప్రధాని మంత్రి అవుతాడని.. జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో కూడా కరెక్టే రిజల్ట్ విషయంలో ముందే చెప్పేసింది. తాజాగా ఈ సంస్థ సర్వే చేసిన రిజల్ట్ విని చంద్రబాబు షాక్ లో ఉన్నారట.