ప్రమాదాలు చెప్పి రావు..ఒకవేళ వస్తే..ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలని మాక్ డ్రిల్ చేస్తున్న సమయంలో నిజంగానే ప్రమాదం జరిగి ఓ విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
చెన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం.. సుమారు 20 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కో విద్యార్థుల చేత రెండో అంతస్తు నుంచి కిందకు ఎలా దూకి ప్రాణాలు రక్షించుకోవాలో చూపించారు..ఆ సమయంలో ఓ వలకూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో లోగేశ్వరి(19) అనే బీబీఏ స్టూడెంట్ను సహాయక సిబ్బంది కిందకు తోశాడు. అయితే ఆ విద్యార్థిని అప్రమత్తంగా లేకపోవటంతో.. కింద ఫ్లోర్ సెల్ఫ్కు తలబలంగా తాకి కుప్పకూలిపోయింది.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ విద్యార్థిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు..కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మరణానికి కారణమయ్యాడంటూ ట్రైనర్ అర్ముగంను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు.