జేసి దివాకర్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను  ఘోరంగా విమర్సించినాడని చెప్పాలి. ఏకంగా పవన్ కళ్యాణ్ కు పట్టుమని పది సీట్లు కాదు కదా! పది ఓట్లు కూడా రావని విమర్శలు కురిపించాడు. ఏపీలో త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావిస్తుంటే పవన్ కుమార్ రెడ్డి మాత్రం ఇలా కరివేపాకు లా తీసేసి మాట్లాడినాడు. అయితే ఇక్కడ పవన్ రెడ్డి ఒక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ కు పది ఓట్లు కూడా రాకపోతే టీడీపీ ఎందుకో 2014 లో పవన్ కళ్యాణ్ మద్దతు కోరిందో... మైకు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ది చెబుతారు పవన్ రెడ్డి. 

Image result for pavan kalyan janasena

ఇంకా అతను ఏమన్నాడంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం అవ్వ‌బోతున్న‌ట్లు క‌ల కంటున్నాడ‌ని, కానీ, ఆయ‌న పోటీ చేసిన చోట ప‌ట్టుమ‌ని ప‌ది ఓట్లు కూడా ప‌డ‌వ‌ని వ్యాఖ్యానించారు ప‌వ‌న్ రెడ్డి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుంటుకుంటూ న‌డుస్తున్నార‌ని, క‌మ్యూనిస్టుల‌ను ఒక క‌ర్ర‌గా, మ‌రో పార్టీని రెండో క‌ర్ర‌గా ఉప‌యోగించుకుంటూ ఆయ‌న అడుగులు వేస్తున్నార‌ని ఎద్దేవ చేశారు.అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు జ‌న‌సేన పార్టీకి అభ్య‌ర్థులే లేర‌ని, ఎన్నిక‌ల నాటికి టీడీపీ, వైసీపీల్లో టికెట్లు రాని నేత‌లే దిక్క‌వుతార‌ని ఆరోపించారు జేసీ ప‌వ‌న్.

Image result for pavan kalyan janasena

టీడీపీతో స్నేహంగానే ఉన్న జ‌న‌సేనానికి అనుకోకుండా ఒక రోజు ఢిల్లీ నుంచి ఫోన్ వ‌చ్చింద‌ని, ఆ ఫోన్ కాల్ త‌ర్వాత ప‌వ‌న్ లో ఊహించ‌ని మార్పు వ‌చ్చిందని, ఆ మార్పుతోనే ఆయ‌న బీజేపీకి దాసోహం అయిపోయి, టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఢిల్లీ నుంచి జ‌న‌సేన పార్టీకి భారీగానే ముడుతోంద‌ని, అందుకే ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నాడ‌ని విమ‌ర్శించాడు జేసీ ప‌వ‌న్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: