ఈ మద్య డబ్బు సంపాదించడానికి నేరస్తులు దేనికైనా తెగిస్తున్నారు. కొంత సెక్స్ రాకేట్, మసాజ్ సెంటర్లు, జూదం లాంటి వాటితో సంపాదిస్తుంటే..మరికొంత మంది కిడ్నాపులు చేస్తూ బెదిరిస్తూ..అందినంత దోచేస్తున్నారు.  తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం..కేశవానగర్ లో నాగేంద్ర ప్రసాద్ అనే వడ్డీ వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. 

ఎస్సై పిలుస్తున్నారని చెప్పి నాగేంద్ర అనే వ్యాపారస్తుడిని కిడ్నాప్ చేసిన దుండగులు.  వెళ్లిన మనిషి ఎంతకీ రాకపోవడం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా, పోలీసులు తమకు నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చారని కుటుంబ సభ్యులు వాపోయారు. 

మరోవైపు బత్తలపల్లి టాచర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ ని కిడ్నాప్ చేశారు.  పోలీసులమని..ఎస్సై పిలుస్తున్నాడని చెప్పి కిడ్నాప్ కి పాల్పపడినట్లు సమాచారం.   రెండు చోట్ల పోలీసులం అంటూ వచ్చి కిడ్నాప్ చేసిన దుండగులు.  ప్రస్తుతం అనంతంపురంలో కిడ్నాపుల కేసు సంచలనం సృష్టిస్తున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: