ఆ నివేదిక బయటపెడితే బాబు గుట్టు రట్టు అవుతుందని బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల పేరు చెప్పి బాబు జలకాలాటలు ఆడారని, ఫలితంగా 29 మంది అమాయకులు బలి అయిపోయారని ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. ఆ చావులపై వేసిన జస్టిస్ సోమయాజులు కమిటీ నివేదికను వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అపుడు బాబు దోషిగా జనం ముందుకు వస్తారని అన్నారు.


ఆయన్ని చూసి నేర్చుకో :


హుందాతనం అన్నది బాబులో మచ్చుకైనా  లేనే లేదని సోము హాట్ కామెంట్స్ చేశారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం, ప్రధాని మోడీని తిట్టడం బాబుకే చెల్లిందన్ని సెటైర్లు వేశారు. విశాఖ మీటింగ్ లో కేంద్ర మంత్రి గడ్కరీ హుందాగా వ్యవహరించారని, ఆయన్ని చూసి మాట్లాడడం నేర్చుకో అంటూ అటాక్ చేశారు. నిందలు వేయడం, విమర్శించడమే పనిగా పెట్టుకున్న బాబుకు అన్నిటా రాజకీయమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 


అసలేంటి సంబంధం :


పోలవరం విషయంలో బాబుకేంటి సంబంధం అంటూ సోము ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. అది జాతీయ ప్రాజెక్ట్, నిధులన్నీ మేమే ఇస్తున్నాం, మధ్యన ఈయన గోలేంటి అంటూ మండిపడ్డారు. ముంపు మండలాలను ఏపీలో కలిపిందే బీజేపీ, దానికి కూడా తన ఖాతాలో వేసుకుని బాబు గొప్పలు పోతున్నాడని సోము అన్నారు. అసలు పోలవరం కట్టే తాహతు లేకనే కదా పట్టిసీమ అంటూ టీడీపీ ఎత్తి పోతల పధకాలకే పరిమితమైందని ఘాటుగానే కౌంటరేసాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: