ఏపిలో గత కొన్ని రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు వస్తున్నాయి.  ఏర్లు..వాగులు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానది ప్రకాశం బ్యారెజ్ నిండుకుండలా తయారైంది.  తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో నాటు పడవ మునిగిపోయింది.  ఈ ఘటన ఐ.పోలవరం మండలం పశుల్లంక దగ్గర జరిగింది. ఈ పడవలో ముప్పయి మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 

కాగా, పవడ పశువుల్లంక నుంచి వలసల తిప్పకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంబవించినట్లు తెలుస్తుంది.  సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వెంటనే ఘటన స్థలానికి బయలు దేరారు.  పడవ ఎక్కిన వారిలో చాలా మంది  విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది.  పాఠశాల ముగిసిన తర్వాత వారంతా ఈ పడవలో బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులను చాలా వరకు రక్షించ గలిగారు. కానీ పది మంది వరకు గల్లంతైనట్లు తెలుస్తుంది.  వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. మరింత సమాచారం విషయాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: