తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తన రోజు కార్యక్రమాలలో ఏదైనా ఒకటి ప్రజలలో ఉండేలా చూడాలని ప్రభుత్వ అధికారులకు సూచించారట. ప్రస్తుతం ప్రత్యర్ధుల పార్టీలు రాష్ట్రంలో యాత్రలు చేపడుతూ ఎన్నికల వేడి పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇదిలావుండగా ఇటీవల చంద్రబాబు గుంటూరులో పర్యటించారు.

Related image

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పర్యటన అనంతరం సొంత నివాసానికి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. వాతావరణ సరిగ్గా లేకపోవడంతో ఆయన హెలికాప్టర్‌లో కాకుండా కొల్లూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా సచివాలయానికి బయల్దేరారు. కాగా గత మూడ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Image result for chandrababu

దీంతో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు కొంత గందరగోళానికి భయానికి గురి అయ్యారు. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు ఇప్పటికే నానా తంటాలు పడుతున్నాడు ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి...

Image result for chandrababu

ఈ నేపథ్యంలో  వాతావరణాన్ని లెక్కచేయకుండా ఎలాగైనా ప్రభుత్వ పనులు ముగించుకుని ప్రజల నమ్మకాన్ని అందుకో డానికి ఆపసోపాలు పడుతున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం అనేక ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలలో వెల్లడైంది. ఇందుమూలంగా చంద్రబాబు ఎక్కువగా శంకుస్థాపన కార్యక్రమం అంటూ రాష్ట్రం అభివృద్ధి చెందిపోయింది అంటూ తన ప్రసంగాలలో దంచి కొడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: