తెలుగు దేశం పార్టీ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల్లో  "అన్న క్యాంటీన్లు" ఒక అంశం. ఈ వాగ్ధానాన్ని అమలు చేసేందుకు, దాన్నుండి అవినీతి పాలు పిండు కొనేందుకు ఇప్పుడు చంద్రబాబుకు సమయం చిక్కింది. ఈ పధకం ప్రారంబించటానికి చంద్రబాబుకు నాలుగు సంవత్సరాలు పట్టింది. అది కూడా ఇప్పుడు నూతన  రచ్చకు తెరలేపుతుంది. 
vijag anna canteen కోసం చిత్ర ఫలితం
అమరావతి నుండి అన్న కాంటీన్ల వరకు ఏ పథకం ప్రారంభించినా తెలుగుదేశం తమ్ముళ్ళ అవినీతి పునాదులతోనే ప్రారంభమౌతుంది. తీరా ఇప్పుడు ఈ పదకం అమల వుతున్నా దానిపై తీవ్రమైన విమర్శలు తప్పడం లేదు. అందులో ముఖ్యమైనది అవినీతి ఆరోపణ.  అన్న క్యాంటీన్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
vijag anna canteen కోసం చిత్ర ఫలితం
నలభై లక్షలరూపాయల నుంచి డెబ్బై లక్షలరూపాయల వరకూ ప్రభుత్వం నుంచి ఈ మేరకు నిధుల కేటాయింపు జరిగిన ఈ నిర్మాణంపై నిజంగా ఖర్చు చేసింది మాత్రం  పది లక్షల రూపాయిలు కూడా కాదంటున్నారు. అంతా నాసిరకం నిర్మాణాలేనని వార్తలువస్తున్నాయి. అంటే ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణంలోనే ఏభై లక్షల రూపాయిల కు మించి అవినీతి జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. దోపిడీ మాత్రం ఆ స్థాయిలో జరిగింది. 
vijag anna canteen కోసం చిత్ర ఫలితం
నిజంగా చెప్పాలంటే తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, తమ్ముళ్ళనబడే వాళ్ళంతా అన్న కాంటీన్ల రూపంలో ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకునేందుకు అన్న క్యాంటీన్ల వాగ్ధానం — యూటర్న్ తీసుకుందని దాని అమలు వారికి పాడి ఆవుగా పని చేసిందని స్పష్టం అవుతోంది. ఇక ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం ఆహారంగా అందిస్తున్నా మని ప్రభుత్వం అంటున్నా, ప్రభుత్వ ఖజానాకు మాత్రం రంద్రం కాకుండా సొరంగమే పడి దోపిడీ స్థాయి జాతికి తీరని వ్యధగా మిగిలేలాగా ఉందంటున్నారు. ఐదు రూపా యల భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ము 75 రూపాయలంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కో ప్లేటు భోజనం మీద భారీ ఎత్తున దోపిడీ జరిగి ప్రజా ధనం దారి మళ్ళి సొమ్ములు గుత్తేదార్లైన తెలుగు తమ్ముళ్ళ జేబుల్లోకే వెళ్తున్నట్టు తెలుస్తుంది.
vijag anna canteen కోసం చిత్ర ఫలితం
ఇలా అమరావతి అధికార భవనాల నుండి అన్నం పెట్టే అన్నా కాంటీన్ల వరకు ఎలాబడితే అలా దోపిడీ చేసుకోవడానికి చంద్రబాబు సర్కారుకు, తెలుగుదేశం తమ్ముళ్ళ కు ఏమైనా జాగీర్దారీ రాసిచ్చిందా? అంటున్నారు ప్రజలు. ప్రతి తెలుగు దేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టే పధకం పార్టీకి బాగా ఉపయోగపడుతున్నాయని స్పష్టం అవుతోంది. ఇక పోతే ఈ  అన్న కాంటీన్ల పదకం ద్వారా ప్రజలకు కనీసం నాం కే వాస్తే ఐనా అన్నం పెడుతున్నారా అని చూస్తే రోజుకు వంద మందికే పెడతాం, రెండు వందల మందికే అన్నం పెడతాం అనే షరతులు జనాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వీరి ఈ తరహా నియమాలు చాలా చోట్ల రచ్చలు చెలరేగేలా చేస్తున్నాయి. 
vijag anna canteen కోసం చిత్ర ఫలితం
దీంతో ఈ క్యాంటీన్ల వద్ద రచ్చ, గోల, రభస తప్పట్లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం అన్న క్యాంటీన్ల  ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ఈ కాంటీన్లు కొన్ని చోట్ల ఆసుపత్రులలోని మార్చురీల ప్రక్కన, మురుగు కాలవల ప్రక్కన, కంపుగొట్టే ప్రాంతాల్లో నిర్మించటం తో అక్కడ అన్నం తినే కొద్దిమందికి కూడా ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నయని అంటున్నారు అమరావతి ప్రజలు.
vijag anna canteen కోసం చిత్ర ఫలితం

అయితే జరిగిన అవినీతితో పోల్చినా జరుగుతున్న అపార ప్రజా ధన వ్యయం చూసినా ఈ క్యాంటీన్ల వ్యవహారం అతిపెద్ద పెద్ద స్కాం కు కాసారమేనని అంటున్నారు. దీన్నిండా అవినీతి  నిండి ఉందంటున్నారు.  పేదలకు అన్నం పెట్టే అన్న కాంటీన్ల లోనే ఇంత అవినీతి దాగి ఉంటే విశ్వనగరం అమరావతి నిర్మాణంలో దాగిన అవినీతి హిమోన్నతమై ఉంటుందని పలువురు అంటున్నారు. 

Anna Canteen

మరింత సమాచారం తెలుసుకోండి: