జేసి దివాకర్ రెడ్డి టీడీపీ లో దైర్యంగా మాట్లాడే నేత అని చెప్పవచ్చు. తన చెప్పాల్సిన దానిని సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాడు. టీడీపీ అధినేత చంద్ర బాబు కు అయినా సరే నిర్మోహాటంగా ఉన్నది ఉన్నట్టు గా చెబుతాడు. అందుకే కాబోలు మిగతా టీడీపీ నేతలతో జేసి కి అస్సలు పడటం లేదు. తన జిల్లా అయినా అనంత పురం లో ఇప్పటికీ మిగతా ఎమ్మెల్యేలతో జేసి కి విరోధం ఉందని చెప్పాలి. 

Image result for jc diwakar reddy

ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కాంగ్రెస్ పార్టీకూడా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పునెక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఆయన బుధవారం రాత్రి అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో కొందరు నేతల వైఖరికి నిరసనగా తాను అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనబోనని ఆయన తేల్చి చెప్పారు. 'కేంద్రంపై టీడీపీ ప్రవేశపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు నేను హాజరు కావడం లేదు.

Image result for jc diwakar reddy

దీనికి రాజకీయ కారణాలున్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం బాగా లేదు. నేను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడం లేదనే విషయం సీఎంకు కూడా తెలుసనుకుంటున్నాను. కాగా, అవిశ్వాస తీర్మానానికి హాజరైనా కాకపోయినా జరిగే పెద్ద నష్టమేమీ లేదు. మోడీని ప్రధాని పదవి నుంచి దించలేమన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశాన్ని టీడీపీ ఎంపీలు చక్కగా వివరించగలరు. నేను అసలు అలగలేదు. అలిగితే బుజ్జగించాలనీ నాకు లేదు' అని జేసీ చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: