కేంద్రంలోని మోడీ దగ్గర తమ ఎత్తులు పారలేదని తెగ ఫీల్ అయిపోతున్న తెలుగు తమ్ముళ్ళకు పాపం విశాఖ ఎంపీ  హరిబాబు అడ్డంగా దొరికేశారు. రైల్వే జోన్ తో పాటు ఏపీకి సంబంధించి హరిబాబు పార్లమెంట్లో చేసిన ప్రసంగం తెలుగు ద్రోహమట. ఆయన మాటలు తెలుగు ప్రజన అభీష్టానికి వ్యతిరేకమట. ఇలా మాటలతో అటాక్ చేస్తూ తమ్ముళ్ళు ఆయన దిష్టిబొమ్మను తగలేశారు. హరిబాబుకు వ్యతిరేకంగా నినాదాలూ చేశారు. అత్త మీద కోపం దుత్త మీద అంటే ఇదేనేమో.


తప్పంతా ఉంచుకుని :


పార్లమెంట్లో అర్ధరాత్రి మోడీ తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు గుట్టు బయటారేసి హోదా పాపం ఆయనదేనని గట్టిగా లోకానికి చెప్పేసిన తరువాత ఆ చేదు నిజాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేక్పోతున్నారు తట్టుకోలేకపోతున్నారు. . బాబు సై అంటే డిల్లీ కదలి రావాలి,  మోడీ అయినా, మరెవరైనా హోదా ఇచ్చేస్తారనుకున్నారేమో. మరి బాబు గారి కలరింగులు ఆ రేంజిలో ఉంటాయి, దానికి తగినట్లు ఏపీలో బాబుకు బాకా ఊదే మీడియా ఏకంగా మోడీ కొంపే మునుగుతోందన్నంత రేంజిలో ఊకదంపుడు దంచి కొట్టింది మరి. తమ్ముళ్ళకు ఆ మాత్రం ఆశాభంగం కలగడంలో తప్పేం లేదుగా.


జోన్ పాపమూ మీదే కదా :


విశాఖకు జోన్ రాకపోవడానికీ టీడీపీ సర్కార్ వైఖరే కారణం కాదా అని వైసీపీ సహా విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మోడీ వచ్చిన తొలి ఏడాదిలోనే జోన్ విశాఖలో పెట్టాలనుకుంటే కాదు విజయవాడలో పెట్టాలంటూ అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టింది టీడీపీ ఎంపీలు రాయపాటి, కేశినేని కాదా అంటున్నారు. లేని కంఫ్యూజన్ పెట్టేసి జోన్ ఇలా పడకేయడానికి కారణమైన టీడీపీ ఇపుడు తాపీగా నిందను బీజేపీ మీదకు నెడుతోందని, ఇందులో ఇద్దరి నేరమూ ఉందని గట్టిగా కౌంటర్ అటాక్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: