పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు ఇంతలా విరుచుకుపడని జగన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చే క్రమం లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి ఘాటుగా స్పందించాడు. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్పై వ్యక్తిగత, రాజకీయ జీవితంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ రాజకీయాలపై మాట్లాడటం, వినడం మన ఖర్మ అన్నారు. విలువలు లేని పవన్ మాట్లాడితే సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు.
పవన్కు విలువలు ఎక్కడున్నాయి? ఆయనకు నలుగురు.. నలుగురు భార్యలు అన్నారు. కొత్త కారు మార్చినట్టు భార్యల్ని మారుస్తాడని ఆరోపించారు. నాలుగేళ్లు, ఐదేళ్లకోసారి భార్యను మారుస్తాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్లా బహుభార్యత్వం వేరొకరికి ఉంటే జైలులో వేసేవారన్నారు.ఈ రోజు వైకాపా పిలుపునిచ్చిన బంద్లో పాల్గొన్నవారికి, మద్దతిచ్చిన అందరికీ జగన్ కృతజ్ఞతలు చెప్పారు. తాము చేపట్టిన బంద్ను విఫలం చేయడానికి చంద్రబాబు చేయని కుట్ర లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 300 మందికి పైగా అరెస్టు చేశారని చెప్పారు. దారుణమైన అణచివేత మధ్య కూడా తమ బంద్విజయవంతమైందన్నారు.
చంద్రబాబు, భాజపా, పవన్ ముగ్గురూ ఏపీ ప్రజల్ని వంచించారన్నారు. చంద్రబాబుకు ఇప్పటికీ భాజపాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లాలో పోరాట యాత్రకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాలు బెణికింది. భీమవరంలోని ఎన్డీ ఫంక్షన్ హాలులో బస చేసిన ఆయనను కలిసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వారిని కలిసేందుకు వెళ్తున్న సమయంలో నేల తడిగా ఉండటంతో ఆయన కుడికాలు బెణికింది. వెంటనే బ్యాండేజీతో కట్టు వేశారు. అయితే, ఆ నొప్పితోనే ఆయన కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. అనంతరం వైద్యులు అక్కడికి చేరుకొని పవన్ కాలికి పరీక్షలు నిర్వహించారు. కాలుకు క్యాప్ వేసిన వైద్యులు స్వల్ప విరామం అవసరమని పవన్కు సూచించారు.