జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే జగన్ ఎప్పుడు కూడా ఈ విధమైన కామెంట్స్ పవన్ కళ్యాణ్ మీద చేయలేదని చెప్పాలి. మీడియా అడిగిన ప్రశ్నలకు సహనము కోల్పోయిన జగన్ కార్లను మార్చినట్లు పెళ్లాలను మార్చే పవన్ గురించి నేను చెప్పాలా ... అని జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. దీనితో ఎక్కడ చూసిన ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
ఆంధ్ర బంద్ సందర్భంగా మంగళవారం ఇదే జరిగింది. సాధారణంగా మీడియా జనాలు ఏం చేస్తుంటారు. వీళ్ల విమర్శలు వాళ్ల దృష్టికి వాళ్ల విమర్శలు వీళ్ల దృష్టికి తెచ్చి, ఆయా జనాలు చేసే కామెంట్ లను బట్టి, హడావుడి చేస్తుంది. ఇప్పుడూ అదే చేసింది. పవన్ చేసిన కొన్ని కామెంట్లను జగన్ దృష్టికి తెచ్చింది. మరి ఏ మూడ్ లో వున్నారో, జగన్ కాస్త గట్టిగానే పవన్ పై కామెంట్లు చేసారు. ముఖ్యంగాఎక్కడ టచ్ చేస్తే పవన్ కు ఆయన అభిమానులకు కాలుతుందో ఆ పాయింట్ టచ్ చేసారు.
'కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తారు' అనేసారు. అన్న తరువాత లోలోపల నాలుక కర్చుకుని వుండొచ్చు. కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. మొత్తం వెబ్ మీడియా అంతా ఇదే ఇప్పుడు హైలైట్ చేసింది. చిత్రమేమిటంటే, జగన్ కు చెందిన సాక్షి మీడియా మాత్రం సమస్యను గుర్తించింది. పొరపాటున కూడా సాక్షి వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన చిన్న వార్త కూడా వుంచలేదు. అయినా జరగాల్సిన డ్యామేజీ ఇక ముందూ జరుగుతుంది. ఈ కామెంట్లను పవన్ దృష్టికి తెస్తారు. ఆయనేదో అంటారు.