జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటుడు, ఎంఎల్ఏ, చంద్రబాబునాయుడు బావమరది నందమూరి బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా భీమవరంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను అభిమానులు కలిశారు. ఆ సందర్భంగా అభిమానులు పోలీసులపై ఫిర్యాదులు చేశారు. తమ మోటారు బైకులకు సైలెన్సర్లు తీసేయటాన్ని పోలీసులు తప్పు పడుతున్నట్లు అభిమానులు చెప్పారు.
ఇంట్లో తుపాకి కాల్చవచ్చా ?
నిజానికి సైలెన్సర్ లేకుండా తిరగటం మోటారు వాహనాల యాక్ట్ ప్రకారం తప్పు. ఎందుకంటే, సైలెన్సర్ లేకుండా నడిచే వాహనం నుండి విపరీతమైన శబ్దం బయటకు వస్తుంది. ఆ శబ్దం ఇతరులకు న్యూసెన్స్ గా ఉంటుంది. కాబట్టి ఏ వాహనం కూడా సెలెన్సర్ లేకుండా తిరగకూడదు. అదే విషయాన్ని అభిమానులకు పవన్ చెప్పి ఉండాల్సింది. కానీ అభిమానులు ఫిర్యాదు చేయగానే రెచ్చిపోయారు. పోనీ పోలీసులను తప్పుపట్టారా అంటే అదీ లేదు. అభిమానుల ఫిర్యాదుకు ఏమాత్రం సంబంధం లేని నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పుల గురించి ప్రస్తావించారు.
అనవసరంగా బాలకృష్ణను లాగారా ?
బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన మాట వాస్తవమే. కానీ కాల్పులు జరిగి కూడా చాలా సంవత్సరాలైపోయింది. తన అభిమానులు మోటారు బైకులక సైలెన్సర్లు లేకుండా తిరుగుతుంటే తప్పంటున్న పోలీసులు, ఇంట్లో తుపాకితో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవటం లేదంటూ పరోక్షంగా బాలకృష్ణను సీన్ లోకి తీసుకొచ్చారు. బాలకృష్ణను ఉద్దేశించి పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే ఏదో ఒక సమయంలో బాలకృష్ణ గానీ లేకపోతే టిడిపి నేతలు కానీ పవన్ పై విరుచుకుపడటం ఖాయం.