పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు ఇంతలా విరుచుకుపడని జగన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చే క్రమం లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి ఘాటుగా స్పందించాడు. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్పై వ్యక్తిగత, రాజకీయ జీవితంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ రాజకీయాలపై మాట్లాడటం, వినడం మన ఖర్మ అన్నారు. విలువలు లేని పవన్ మాట్లాడితే సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీనికి పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి నీతులు చెబుతున్నాడని సెటైర్ వేయడం వైరల్ అయ్యింది. అయితే ఈ కామెంట్స్ కు జనసేన అభిమానుల నుంచి మరో విధంగా ఆన్సర్ అందుతోంది. ఇక అసలు విషయంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు డిఫెరెంట్ స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. రీసెంట్ గా భీమవరం సమీపంలో ఉన్న నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో పలు సేవ కార్యక్రమాలు చేస్తున్న జన సైనికులతో ‘నవయుగ జనసేన’ పేరు పై ఒక కార్యక్రమం జరిపారు.
ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ కే అంతుంటే.. నిజాయతీ పరుడినైన నాకెంత ఉండాలని పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. మార్పుకోసం ప్రయత్నం చేస్తున్నందు వల్ల ఈ విమర్శలు చేస్తున్నారు. సామజిక మార్పు తీసుకురావడం నా ఆశయం. దాని కోసమే సినిమాలను ఎంచుకున్నాను. జనసేన ఆలోచన విధానం వల్లే ఉద్దానం ఉండవల్లి వంటి ప్రాంతాల సమస్యలు బయటకు వచ్చాయని చెప్పారు. ఉద్దానం సమస్యను బయటకు తీసుకువచ్చింది ఎవరో పెద్ద నాయకుడు కాదని మీ లాంటి ఒక సాధారణ జన సైనికుడిని పవన్ తన వివరణ ఇచ్చాడు.