చంద్రునికి సూర్యుడుకి   మధ్యగా భూమి  వచ్చినపుడు అంటే  సూర్యని కాంతి చంద్రుని పైన పడకుండా భూమి అడ్డువచ్చినపుడు  భూమి పైన వున్నవారికి  చంద్రుడు కనిపిస్తాడు. దీన్ని  చంద్రగ్రహణం అంటారు. ఈ  ఏడాది  మనకు సుదీర్ఘ చంద్రగ్రహణం కనిపిస్తుంది.  వినీలాకాశంలో మహత్తర దృశ్యం కనిపించనుంది. అరుదైన అరుణవర్ణ చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. రేపు రాత్రి 11 గంటల 54 నిమిషాలకు మొదలై… అర్ధరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ దశకు చేరుకోనుంది. మరో అద్భుతం కూడా దీనికి తోడు కానుంది. బ్లడ్‌ మూన్‌ ఓ వైపు కనువిందు చేయనుండగా… అంగారక గ్రహం భూమికి అతి చేరువగా రానుంది. చంద్రుని పక్కనే ప్రకాశవంతంగా కనిపించనుంది.


2003 తర్వాత కుజుడు ఇలా రావడం ఇదే తొలిసారి. ఈ శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఒకవైపు… 15 ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వచ్చే కుజ గ్రహం మరోవైపు ఆకట్టుకోనున్నాయి. కొన్ని  చోట్ల జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనమ్, అని మరియు సుదీర్ఘ చంద్రగ్రహణం  తర్వాత ఎక్కడో ఒక చోట ఏమయినా జరగవచ్చు అని చెపుతున్నారు.   కానీ వీటిని సైన్టిష్ఠులు ఏమి జరగదు అని చెప్తున్నారు. ఒకే సరళరేఖపై ఉన్న సూర్య, చంద్రుల మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.


సూర్యకాంతితో ధవళ వర్ణంలో మెరిసే జాబిల్లి ఆనాడు వెలవెలబోతుంది. ప్రతి నెలా భూమి, సూర్య, చంద్రులు ఒకే సరళరేఖ పైకి వస్తుంటారు. అయితే భూమి ఓ వైపునకు వంగి భ్రమించడం వల్ల దీని నీడ చంద్రుడి పై నుంచి లేదా కింద నుంచి వెళ్లిపోతుంటుంది. దీంతో గ్రహణం ఏర్పడదు. ఒక్కోసారి గ్రహణం ఏర్పడే సమయంలో.. భూ వాతావరణం గుండా పయనించే కాంతి చంద్రుడిపై పడుతుంది. దీంతో జాబిల్లి రక్త వర్ణంలో కనిపిస్తుంది. ఈ పరిణామాన్నే బ్లడ్‌ మూన్‌గా పిలుస్తారు. 


శుక్రవారం ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైనదిగా రికార్డు సృష్టించబోతోంది. భారత్‌, పాక్‌, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ప్రాంతాల్లో సంపూర్ణంగా గ్రహణం కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, న్యూజీలాండ్‌, ఇరాన్‌, సూడాన్‌, టర్కీ, కజకిస్థాన్‌ లో పాక్షికంగా గోచరిస్తుంది. అమెరికా, ఆర్కిటిక్‌ ప్రాంతాల్లో అసలు కనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: