పవన్ కళ్యాణ్ మీద జగన్ చేసిన వ్యాఖ్యల తో ఒక్క సారిగా దుమారం చెలరేగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ మీద అతని ఫ్యామిలీ మీద విష ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు జగన్ తో ఒక తెలుగు హీరోయిన్ సెల్ఫీ దిగింది. దానిని పట్టుకొని పవన్ అభిమానులను నానా యాగీ చేస్తూ, రెచ్చి పోతున్నారు. అయితే దాని గురించి సదరు హీరోయిన్ స్పందించింది. నేను జగన్ తోనే కాదు వెంకటేష్ మరియు బాలకృష్ణ తో కూడా సెల్ఫి దిగానని, . ఓ తండ్రిలాగా, ఓ పెద్దన్నయ్యలాగా జగన్ ని అందరూ భావిస్తుంటారని, అదే ఉద్దేశంతోటే తాను జగన్ తో సెల్ఫీ దిగానని ఫేస్ బుక్ లో స్పందించింది. 
Image result for jagan

జగన్ తో సెల్ఫీ దిగిన ఈ అమ్మాయి పేరు అలేఖ్య ఏంజెల్. మిస్టర్ మణి, ఆనందం మళ్లీ మొదలైంది, లవ్ ఇన్ మలేసియా.. వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. మోడలింగ్ రంగంలోనూ రాణిస్తోంది. 2017 ఫిబ్రవరి 18న లోటస్ పాండ్ లో జరిగిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్లో ఈ ఫొటో దిగినట్టు స్పష్టంచేసింది అలేఖ్య. ఆ కార్యక్రమానికి తన కుటుంబంతో సహా హాజరయ్యానని తెలిపింది. అదే సందర్భంలో జగన్ తో సెల్ఫీ దిగానని చెప్పుకొచ్చింది. 

Image result for jagan and pavan

జగన్ తోనే కాదు.. పలువురు హీరోలు, సినీ ప్రముఖులతో కూడా పలు సందర్భాల్లో సెల్ఫీలు దిగింది అలేఖ్య ఏంజెల్. వాటన్నిటినీ పక్కనపెట్టి, జగన్ తో దిగిన సెల్ఫీనే ఏరికోరి ఎంచుకుని పవన్ అభిమానులు జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. పవన్ కల్యాణ్ కి తాను వీరాభిమానిని అని చెప్పిన ఆ అమ్మాయి ఇలాంటి చీప్ ట్రిక్స్ తో అలాంటి గ్రేట్ హీరో పరువు తీయొద్దని కాస్త గట్టిగానే హెచ్చరించింది. అయినా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వ్యాఖ్యలు విన్న తరువాత అయినా మారతారో లేదో చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: