వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. మంత్రులు, పార్టీ నాయకులకూ ఆయన ఇదే చెబుతున్నారు. డబ్బులకు వెనకాడవద్దు, నిధులు ఎన్ని అయినా పంపిస్తా, వాటితో జనం సమస్యలు తీర్చండి, వారిని ఓట్లుగా మార్చండంటూ అమరావతి నుంచి హుకుం జారీ చేశారట.


ఏ సమస్యా ఉండకూడదు :


ప్రజలకు ఏ సమస్యా ఉండకూడదు, వారి అడిగిన పనులను వెంటనే చేసి పెట్టంది, నిధుల సంగతి నాకు వదిలేయండి, ఎంత కావాలంటే అంత పంపుతా.. ఇదీ బాబు గారి భరోసా. జిల్లాకు  పాతిక కోట్లు, ప్రతి ఎమ్మెల్యేకు కోటి రూపాయలను మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాటితో జనం సమస్యలు తీర్చాలని కోరుతోంది. ఎక్కడికక్కడ టీడీపీని హైలెట్ చేస్తూ ముమ్మరంగా పార్టీ ప్రచారం  చేయాలని టార్గెట్లు పెడుతోంది.


ఓట్లుగా మారాల్సిందే :


సమస్య తీరగానే జనం వెళ్ళిపోకూడదు, వారిని టీడీపీకి అనుకూలంగా మార్చేయాలి. మీకు ఇది చేసి పెట్టాం, మాకు ఓటు వేసి పెట్టండంటూ డైరెక్ట్ గానే  బేరం పెట్టేసుకోవాలంట.  ఈ రాయబేరాలకు ప్రతి వంద మంది ప్రజలకూ ఓ టీడీపీ సీనియర్ కార్యకర్తను కూడా పార్టీ ఇందుకోసం నియమించింది. వారు రేపటి ఎన్నికలు అయ్యేంతవరకూ ఆ వంద మందితోనూ నీడలా ఉంటారు. 


వారి సమస్యలను ఎమ్మెల్యేలు, మంత్రులకు చెప్పి తీరుస్తూ వారి ఓట్లు టీడీపీ ఖాతాలో పడేలా చేయడమే ఆఈ కార్యకర్తల పని.  ఇలాంటి  కరడు కట్టిన కార్యకర్తలను ఏరి కోరి తెచ్చి   మరీ ఇపుడు విశాఖ లో కఠోరమైన శిక్షణ ఇస్తున్నారు. అంటే జల్లెడ పట్టినట్లుగా జనాన్ని పట్టేసి  మొత్తం ఓట్లన్నీ టీడీపీకి దక్కేలా చేసేదుకు బాబు మాస్టర్ ప్లాన్ తో దూసుకువస్తున్నారన్నమాట.  ఇందుకు పవర్ ని పూర్తిగా వాడేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: