దెందులూరు నియోజకవర్గం శాసనసభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు పొలిటికల్ టైగర్ అని పిలిచే చింతమనేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని ఉద్దేశించి సంచలన కామెంట్లు చేశారు. తాజాగా ఇటీవల దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి మెయిన్ కారణం చిరంజీవి అని అన్నారు. మార్పు అనే పేరుతో ఆనాడు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తన అభిమానులను కాపు సామాజిక సోదరులను దారుణం గా నమ్మించి మోసం చేశారని చిరంజీవి కుటుంబం ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ని దారుణంగా విమర్శించారు చింతమనేని.

Image result for pawan chiru

సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు ఆనాడు పార్టీ అభ్యర్థుల టికెట్లను అమ్ముకున్నారని విమర్శించారు. ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని... ఇప్పటివరకు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని చింతమనేని ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా అని మండిపడ్డారు.

Image result for pawan  chinthamaneni

అలాంటి వాడివి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా, జనసేన పార్టీ ఎందుకు పెట్టావు అంటూ నిప్పులు చెరిగారు. ‘పవన్‌ కల్యాణ్‌ నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు. నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని ఊగిపోతున్నారు.. మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరు’అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Image result for pawan chiru

అయితే చింతమనేని ఇంతగా ఊగిపోవడానికి గల మెయిన్ కారణం దెందులూరు నియోజకవర్గంలో ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమానులు చింతమనేని ఉద్దేశించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ఒక బుద్ధ కార్యక్రమంలో పబ్లిక్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కాంగ్రెస్ నాయకుడు చిరంజీవిని ఏకిపారేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: