ప్రపంచం రాజకీయ వేత్తలలో కరుణానిధి యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే. తొంభై నాలుగేళ్ల కరుణానిధి డబ్భై ఏళ్ళకి పైగా తన జీవితం రాజకీయాలలో గడిపారు. రాజకీయమే ఊపిరిగా బతికిన ఆయన కడ ఊపిరి తో ఇప్పుడు పోరాడుతున్నారు. ఆయనకీ మృత్యువు కీ మధ్యన ఆసక్తికర పోరు సాగుతూ ఉంది.
ఈ పరిస్థితి లో సోషల్ మీడియా లో ఆయన ఇక లేరు అనీ చనిపోయారు అనీ రచ్చ జరుగుతూ ఉండడం గమనార్హం. కొన్నాళ్ళ క్రితం జయలలిత విషయం లో కూడా సోషల్ మీడియా ఇలాగే కంగారు పడింది. ఆమె ఇంకా ఆసుపత్రిలో ఉండగానే చనిపోయింది అంటూ హడావిడి జరిగింది.
మెయిన్ స్త్రీం మీడియా ఇంకా ఏమీ చెప్పకుండానే సోషల్ మీడియా కంగారు పడ్డం మనం చూసాం. కరుణానిధి విషయం లో కూడా అదే జరుగుతోంది ఇప్పుడు. ఆయన ఆసుపత్రి లో జేరిన మొదటి నిమిషం నుంచీ కూడా చనిపోయారు అనే పుకార్లు దావానం లాగా వ్యాపిస్తున్నాయి ఇంటర్నెట్ లో.
ఆయన సన్నిహితులు ఎంతగా ఈ విషయం లో జనాలకి క్లారిటీ ఇస్తున్నా కూడా పుకార్లు ఎక్కడా తగ్గడం లేదు! సోషల్ మీడియా వలన అసలు నిజాలు బయటపడడం సంగతి పక్కన పెడితే ఇలాంటి పుకార్లకీ ఈ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.