అదేంటో యనమల రామక్రిష్ణుడు ఏ మధ్య కాలంలో స్థాయి తగ్గి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర నాయకుల మాదిరిగానే ఆయన కూడా మీడియా  ముందుకు రాగానే పూనకం వచ్చినట్లుగా జగన్ పై రెచ్చిపోతున్నారు. ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడిన  యనమల జగన్ ప్రతీ కులాన్ని మోసం చేసుకుంటూ వెళ్తున్నారని అనేశారు. తాము ప్రతి కులాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పుకున్నారు. ఈ మాటలు విన్న వారెవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 


మోసం చేసింది మీ పార్టీ కాదా :


కులాలను ఓట్లుగా మార్చుకోవాలన్న దురాశతో టీడీపీ 2014 ఎన్నికలలో ప్రతి కులానికీ హామీ ఇచ్చి మోసం చేసింది. ప్రధానంగా కాపులను బీసీలలో కలుపుతామని చెప్పి నాలుగేళ్ళైనా ఏమీ చెయలేక చివరికి మోసమే చేసిందెవరు.  మత్స్యకారులను ఎస్టీ  జాబితాలో పెడతామని చెప్పి చివరకు విశాఖలో చంద్రబాబు  వారిని ఎంతగా తిట్టి అవమానపరచిందీ లోకం చూసింది. ఈ మధ్యనే నాయీ బ్రాహ్మళ్ళ సమస్యలపైనా సీఎం వద్దకు వెళ్తే ఎంతలా తిట్టాలో అంతలా తిట్టిపోశారు. వీళ్ళే కాదు, అనేక చిన్న కులాలను కూడా టీడీపీ మోసం చేసింది. ఇవన్నీ తన వద్ద పెట్టుకుని జగన్ మోసం చేశాడని యనమల వారు తీరి కూర్చుని ఎలా స్టేట్మెంట్ ఇచ్చారో మరి.


ఇచ్చిన హామీలు చేశారా :


ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చిన టీడీపీ సర్కార్ వాటిని ఎంత వరకు అమలు చేసిందో యనమవారు చెబితే బాగుంటుంది. అంతే కాదు, ప్రత్యేక హోదా బదులుగా ప్యాకేజ్ బాగుందని ఒప్పుకున్నామని  ఇవాళ కూడా ల ఆయన మరోమారు చెప్పారు.  మరి ఆనాడు అంతలా ప్యాకేజ్ బాగుందని నమ్మించి మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, మీరెందుకు అలా మోసపోయారో కూడా చెబితే బాగుంటుంది. ఏదేమైనా ఎన్నికల వేళ అధికార పార్టీ నాలుక ఎన్ని మడతలు వేయాలో అన్నీ వేస్తూంటే యనమల వారు కూడా రెడీ అంటూ పోటీ పడుతున్నారు. పెద్దాయన ఇలా అయ్యాడేంటని జనం విస్తుపోదురు గాక.



మరింత సమాచారం తెలుసుకోండి: