విశాఖ జిల్లా రావాలంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు హడలెత్తేలా ఉంది. జిల్లాలో ఇద్దరు సీనియర్ మంత్రులు, ఎంతో మంది సీనియర్ నాయకులున్నా పార్టీ మాత్రం నత్తనడకేస్తోంది. ఇక గ్రూపులు, గొడవలు చెప్పనక్కరలేదు. ఇదిలా ఉండగా మంత్రి గంటా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే కీలమైన మీటింగ్ విశాఖలో జరిగితే దానికి గంటా వారు డుమ్మా కొట్టారు, ఆ సంగతి సీఎం కి కంప్లైంట్ చేస్తానని ఇంచార్జ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప చెప్పారు కూడా


చెరో వైపూ..క్యా సీన్ హై :


మరి అదేమైందో తెలియదు కానీ ఈ రోజు విశాఖలో చంద్రబాబు ప్రోగ్రాం లో మాత్రం ఇద్దరు మంత్రులూ కనిపించారు. గంటా బాబుకు ఒక వైపు ఉంటే, అయ్యన్న మరో వైపు ఉన్నారు. అలాగే నిమ్మకాయల వారూ ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రులు బాబుతో ఉండడం చూసిన తమ్ముళ్ళు సీన్ బాగా  పండిదని సెటైర్లు వేశారు. బాబుతో ఇలా షేర్ చేసుకున్నా ఎవరి దారి వారిదే అన్నది అందరికీ తెలిసిందే.


ప్రభుత్వ కార్యక్రమమనేనా :


గంటా చంద్రబాబుతో కలసి ఉండడం ద్వారా తాను టీడీపీకి దూరం కావడం లేదని సంకేతాలు ఇచ్చారని పార్టీ నాయకులు కొందరు అంటూంటే ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని అందుకే మంత్రి వచ్చారని మరి కొందరు  చెబుతున్నారు. పార్టీ విషయంలో మాత్రం గంటా స్టాండ్ అలాగే ఉందనీ అంటున్నారు. అయితే బాబు జోక్యం చేసుకుని గంటాకు నచ్చచెబుతారని ఆయన పార్టీలోనే కొనసాగుతారని టీడీపీ పెద్దలు అంటున్నారు. మొత్తానికి గంటా ఎపిసోడ్ సీఎం టూర్లో హైలెట్ అవుతోంది



మరింత సమాచారం తెలుసుకోండి: