ముద్ర గడ పద్మనాభం కాపుల రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్న నాయకుడు అయితే ఇప్పుడు ముద్ర గడ పద్మ నాభం మాట్లాడుతున్న మాటలు అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జగన్ మాట్లాడిన మాటలే టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడినాడు. మరీ జగన్ విషయం లో ముద్ర గదా ఎందుకు అంతగా ఫైర్ అయ్యాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరీ యనమల కూడా అదే కదా మాట్లాడింది.
జగన్ మాట్లాడని అంశాల్లోకి ముద్రగడ జొరబడి విమర్శలు చేశారు. జగన్ సీఎం ఆకాంక్షను విడిచిపెడితే తామూ రిజర్వేషన్లను వద్దనుకుంటామన్నారు. లక్షలాది రూపాయలను తమ కులపోళ్లతో పాదయాత్రలో ఖర్చు చేయిస్తున్నారని వాపోయారు. అంతేకాదు చంద్రబాబు వల్లే ఏదైనా తమకు న్యాయం జరుగుతుందని తన నమ్మకాన్ని వెల్లడించారు. కాపుజాతిని ముద్రగడ మోసం చేయాలనుకున్న ఆయన మనసు మాత్రం అసలు విషయాన్ని చెప్పి నిజాయితీని నిరూపించుకొంది.
ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, హక్కు ఆయనకు ఉన్నాయి. కాని తన స్వార్థం కోసం లక్షలాది మంది కాపుజాతి ఆకాంక్షను ఎవరైతే వంచించారో వారికి తాకట్టు పెట్టాలనుకోవడమే క్షమించరాని ద్రోహం. ఇప్పటి వరకు యనమల వ్యాఖ్యలపై ముద్రగడ స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మౌనం అంగీకారమనుకోవాలా. ముద్రగడ మాటతీరు చూస్తుంటే ఆయన కాపులకు బదులుగా వంచకులకు మరోసారి 'కాపు'కాసేలా ఉన్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.