తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మద్య పెద్ద వార్ నడుస్తుంది.  ఓ వైపు బంగారు తెలంగాణ సాధిస్తున్నామని టీఆర్ఎస్ నేతలు అంటుంటే..తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. 
Image result for ktr
గత కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కలవబోతున్నాయని..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో..మంత్రి కేటీఆర్  కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయంట, సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల చేశారు.  తాజాగా ఈ వ్యాఖ్యలపై వీహెచ్ స్పందిస్తూ..సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నప్పుడు సింహం గుర్తుకు రాలేదా? అంటూ ఎద్దేవా చేశారు. చివరకు పండుగలను కూడా టీఆర్ఎస్ హైజాక్ చేస్తోందని మండిపడ్డారు.

అమ్మవారికి కేసీఆర్ కూతురు కవిత బోనం ఇస్తే... అందరూ ఇచ్చినట్టేనా? అని ప్రశ్నించారు. రంగం సందర్భంగా స్వర్ణలత, జోగిని శ్యామల చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.పాస్ బుక్ కావాలని అడిగిన పాపానికి హుజూరాబాద్ లో రైతు రాజయ్యకు సంకెళ్లు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పాపం చేశాడని అతనికి సంకెళ్లు వేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రైతుబంధు పథకం పేరు చెబుతూ, మరోవైపు రైతులకు సంకెళ్లు వేస్తున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: