వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దారుణమైన కామెంట్లు చేసింది. తాజాగా ఇటీవల రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కి చిన్న మెదడు చిట్టి పోయిందని...అందుకే నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది గ్రామదర్శిని కార్యక్రమంలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబుని హాస్పిటల్లో జాయిన్ చేయాలని అన్నారు. చంద్రన్నను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Image result for chandrababu

ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉదని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా? అని ఈ సందర్భంగా ఆమె సూటి ప్రశ్న సంధించారు. నాలుగేళ్ల జగన్ పోరాటం, వైసీపీ ఎంపీల రాజీనామాల తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రోజా నిప్పులు చెరిగారు.

Image result for roja ysrcp chandrababu

అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న టిడిపి నాయకుల పై రోజా ఫైర్ అయ్యారు. జగన్ తప్పు చేయలేదు కాబట్టి ప్రజల మధ్యనే ఉండి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నాడు...జగన్ లక్ష కోట్ల దోచాడు అని అంటున్న చంద్రబాబు..దేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.

Image result for roja ysrcp

2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో 250 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబును వచ్చేఎన్నికలలో బంగాళాఖాతంలో ఆంధ్రులు కలిపేస్తారని సంచలన కామెంట్లు చేశారు రోజా.




మరింత సమాచారం తెలుసుకోండి: