వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్ర ముగించుకుని త్వరలో...అనగా ఈనెల 12వ తారీకున విశాఖ జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాలో అడుగు పెట్టబోతున్న జగన్ ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తారని వైసీపీ వర్గాల నుండి సమాచారం.

Image may contain: 7 people, people smiling, crowd

ఎక్కువగా విశాఖ జిల్లా నుండే  రాష్ట్రంలో వైసిపి పార్టీలోకి రావాలనుకుంటున్న చాలామంది నాయకులు చేరుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అధికారపార్టీకి ఒక షాక్ ఇచ్చేవిధంగా జగన్ పాదయాత్ర కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా జగన్ విశాఖ జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో తన తల్లి విజయమ్మ ఇదే జిల్లా నుండి పోటీచేసి ఓడిపోయిన నేపథ్యంలో...జగన్ విశాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టారు అట.

Image may contain: 6 people, people smiling, outdoor

మరిముఖ్యంగా జగన్ రాకకోసం విశాఖవాసులు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల ముందు జగన్ తలపెట్టిన ఈ పాదయాత్ర వైసీపీ పార్టీకి చాలావరకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చింది...

Image may contain: 7 people, people smiling, selfie

ఇదే  విషయాన్ని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు జగన్ నడిచిన పాదయాత్ర ఒకరకమైతే... విశాఖలో నుండి అడుగుపెట్టే పాదయాత్ర రాజకీయ ప్రత్యర్ధులకు దిమ్మతిరిగిపోయే విధంగా ఉంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు. విశాఖ వేదిక నుండి ప్రత్యర్థి పార్టీ లకు నాయకులకు దిమ్మతిరిగిపోయే విధంగా ఆంధ్ర రాజకీయాన్ని రసవత్తరం చేయబోతున్నారట జగన్.




మరింత సమాచారం తెలుసుకోండి: