తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు అబద్దపు హామీలు తప్ప నాలుగున్నరేళ్ళలో చేసిందేమీ లేదని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఎన్నికల ముందూ తరువాత విచ్చలవిడిగా భారీ హామీలు ఇచ్చిన టీడీపీ సర్వం అవినీతిమయం చేసిందని మండిపడ్డారు. పోయిన ఎన్నికలలో జిల్లాలో పద్నాలుగుమంది ఎమ్మెల్యేలను జనం టీడీపీకి ఇస్తే, వైసీపీ నుంచి మరో ముగ్గురిని కొనుగోలు చేసిన బాబు మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేను తన పక్కనే పెట్టుకుని కూడా జిల్లాకు గుండు సున్నా చుట్టారని ఫైర్ అయ్యారు.


పోలవరం అవినీతిమయం :


ఏపీకి వరం కావాల్సిన పోలవరం అవినీతిమయం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. పునాదుల నుంచి ఒక్క అంగులం కూడా నిర్మాణం ముందుకు కదలలేదని, కాంట్రాక్టర్ల ద్వారా లంచాలు తీసుకోవడానికి ఆరాటం తప్ప ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల  చిత్త శుద్ధి లేదని సెటైర్లు వేశారు. ఏం చేసినా వైఎస్సార్ హయాంలోనే జరిగిన అభివ్రుధ్ధి తప్ప జిల్లాలో మరేం కనిపించడంలేదన్నారు.


అవన్నీ ఏమయ్యాయి :


జిల్లాకు పెట్రోలియం యూనివర్శిటీ, పెట్రోలియం కారిడార్, నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్ పార్క్, విశాఖ-చెన్నై కారిడార్ అంటూ గొప్ప కబుర్లు చెప్పిన బాబు ఒక్కటంటే ఒక్కటీ చేయలేక చేతులెత్తేశారని జగన్ అటాక్ చేశారు. తాగేందుకు నీరు లేదు, మధ్యం తప్ప, సాగు నీరు అంతకంటే లేదు రైతుల   కన్నీరు  తప్ప, ఇదీ తూర్పు గోదావరికి బాబు చేసిన అభివ్రుధ్ధి అంటూ విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తూర్పు గోదావరి జిల్లాను అన్ని విధాలుగా ప్రగతి బాటన నడిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కత్తిపూడి జగన్ సభకు భారీగా జనం రావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: