ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లోనూ చంద్రబాబు నాయుడు ఆయనకు చేసిన ద్రోహమే ప్రధానం కావాలి. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందీ, ఎన్టీఆర్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడానికి, చివరకు ఆయన తీవ్ర మానసిక వ్యధతో ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు ద్రోహమే కారణమనడంలో సందేహంలేదు. పెద్దాయన రాజకీయ జీవితంలో దీనికంటే ముందు మంత్రివర్గ సహచరుడు నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు ఘట్టం ఉంది.
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని ద్రోహాల్లో దేన్ని బయోపికల్లో ఉంచుతారు ? ఎవరిని విలన్గా చిత్రీకరిస్తారు? ఈ ఘట్టాలు లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే భావితరాలకు అవాస్తవాలు చెప్పినట్లుగా, చరిత్రను వక్రీకరించినట్లుగా అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్లో ఏఏ ఘట్టాలు ఉండాలో, ఏది ఎలా చిత్రీకరించాలో చంద్రబాబే నిర్దేశిస్తున్నారట..! తాజాగా ఆయనతో బాలయ్య, దర్శకుడు క్రిష్, నటుడు రానా మూడుగంటలు చర్చలు జరిపారు. బాబుగారే మార్గదర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆయనకు ఇబ్బంది కలిగించే సన్నివేశాలుంటాయా? బాబుకు సొంత బావమరిది మాత్రమే కాకుండా వియ్యంకుడు కూడా అయిన బాలయ్య కథంతా ముందే చెప్పివుంటాడు. ఈ బయోపిక్ భావి తరాలకు ఎంతవరకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందో చూడాలి..!