అవును మీరు చదివింది నిజమే. ఈమధ్య చంద్రబాబునాయుడు ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా జనాలు మాత్రం హాజరుకావటం లేదు. గ్రామదర్శిని అని ధర్మపోరాటమని ఏదేదో పేర్లతో చంద్రబాబు తరచూ బహిరంగ సభలు పెడుతున్నారు. వరసగా అన్నేసి సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే జనాలు మాత్రం ఎన్నిసార్లని వస్తారు ? నేతలు మాత్రం ఎంతకని సమీకరిస్తారు ? దాంతో చంద్రబాబు సభలంటేనే జనాలు, నేతలు భయపడిపోతున్నారు. అందుకనే ఈమధ్య చంద్రబాబు సమావేశాల్లో ఎక్కడా జనాలు కనిపించక బోసిపోతున్నాయి.
చీరాలలో అప్రకటిత శెలవు
ఇంతకీ ఇపుడిదంతా ఎందుకంటే, ఈరోజు చీరాల మండలంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. మండలంలోని వేటపాలెం ఇంజనీరింగ్ కాలేజీలో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు. దాంతో జనసమీకరణ చేయాల్సిన బాధ్యత స్ధానిక నేతలపై పడింది. జనసమీకరణ చేయక నేతలకు తప్పకపోయినా సభకు హాజరవ్వాల్సిన అవసరం జనాలకు లేదు కదా ?
అయినా జనాలు ఇష్టపడటం లేదు
అందుకనే ముందు జాగ్రత్తగా చీరాలలోని విద్యాసంస్ధలకు శెలవులు ప్రకటించారట. అంతేకాక వ్యపార సంస్ధలకు కూడా శెలవులు ఇచ్చేశారట. చీరాలలో నిత్యం బిజీగా ఉండే మహాత్మా గాంధి క్లాత్ మార్కెట్ ఈరోజు ఖాళీగా కనిపిస్తోంది.
చంద్రబాబు సభలు జనాలకు ముడిపెట్టటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆ మధ్య ఒంగోలులో కూడా ఇదే విధంగా చేశారట. విద్యాసంస్ధలకు శెలవులు ప్రకటించేసి జనసమీకరణకు ఆ బస్సులను వాడుతున్నారు. ఇంత చేస్తున్న జనాలైతే చంద్రబాబు సభలకు రావటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇది దేనికి సంకేతమబ్బా ?