తమిళనాడు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసిన మహా నాయకుడు, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇక లేరు. ఈ రోజు సాయంత్రం 6.10 నిముషాలకు ఆయన మరణీంచినట్లుగా కావేరి ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అనేక పోరాటాలలో ఆరితేరిన ఉద్దండ పిండం కరుణానిధి జీవిత విశేషాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఆయన అచ్చ తెలుగు బిడ్డ అంటే నమ్మడానికి ఎలాగున్నా అది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం.
మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువలైలో 1924 జూన్ 3న కరుణానిధి పుట్టారు. ఆయన తల్లితండ్రులు తెలుగు వారు. ఆయన మాత్రు భాష తెలుగు. ముత్తువేలు, అంజు దంపతుల బిడ్డ అయిన కరుణానిధికి అమ్మానాన్నలు పెట్టిన పేరు దక్షిణామూర్తి. . చిన్నతనం నుంచే అనేక సామాజిక ఉద్యమాలలో పాలుపంచుకున్న కరుణానిధి 1969లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చివరిగా 2006 మే 13న ఐదవమారు సీఎం గా తమిళ పీఠం ఎక్కారు. భారత దేశ రాజకీయాలలో ఆయన ప్రభావం ఎన్నతగినది.