డీఎంకే అధినేత కరుణానిధి మరణించడంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో కరుణానిధి మరణవార్త విని ..తమిళ ప్రజలు ఎంతగానో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరుణానిధి మరణం పట్ల దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ప్రధాని మోడీ అలాగే ప్రముఖ జాతీయ నాయకులు సానుభూతిని తెలియజేశారు.
ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చంద్రబాబు వైఎస్ జగన్ కూడా తమ సానుభూతిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాజీ దివంగత ముఖ్యమంత్రి... వైసీపీ అధినేత జగన్.. తండ్రి అయిన దివంగత రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో ఉమ్మడిగా ఉన్న ఆంధ్రరాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆ సమయంలో వైయస్ఆర్ మరణవార్త విని చాలామంది తట్టుకోలేక మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో వైయస్ మరణం పట్ల దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు తమ సానుభూతిని వ్యక్తం చేస్తే...ఆ సమయంలో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి మాత్రం దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు.
చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత మాజీ సీఎం కరుణానిధి వైఎస్సార్ కు ఘన నివాళులు అర్పించారు. కరుణానిధికి తమిళనాడు రాష్ట్రంలో మెరీనా బీచ్ తీరాన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నివాళులు అర్పించింది. ఈ క్రమంలో కరుణానిధి పార్థివ దేహాన్ని చూడటానికి దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలంతా తమిళనాడు ప్రాంతానికి చేరుకుని నివాళులర్పించారు.