భార్య భర్తల అనుబంధం అంటే చచ్చే వరకు ఒకరిని విచి ఒకరు ఉండకూడదని అన్ని సాంప్రదాయాల్లో చెప్పే నీతి వాక్యం. ఈ వాఖ్యాలు వింటూ పెద్దల ముందు భార్యాభర్తలుగా ఒక్కటవుతారు.  కానీ  ఈమద్య దాంపత్య జీవితాల్లో వస్తున్న అల్లకల్లోల వల్ల సంబంధబాంధవ్యాలు దారుణంగా నాశనం అవుతున్నాయి.  భార్యలపై అనుమానంతో భర్తలు దారుణంగా చంపుతున్నారు..ఇక ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా ఖడతేర్చుతున్నారు భార్యలు. 

తాజాగా తన భార్య అందంగా ఉందని ఆమెకు ఖరీదు కట్టి అమ్మబోయిన ఓ దుర్మార్గుడు ఉదంతం వెలుగులోకి వచ్చింది.  బిహార్ లోని అరారియాకు చెందిన సద్దాం(32) మొదటి భార్య, పిల్లలతో కలసి ఢిల్లీలో ఉంటున్నాడు. అయితే, మొదటి భార్య ఉండగానే మరో మహిళ(28) అందానికి ఆకర్షితుడై ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. తన గుట్టు బయట పడుతుందని ఆమెను వేరు వేరు చోట్ల కిరాయి తీసుకొని ఉంచుతూ సంసారం చేయసాగాడు. అయితే తాను ఎంతగా ఆ అందానికి ఆకర్షితుడు అయ్యాడో..ఆ అందం అంటే ఈర్ష్య పుట్టింది..తన భార్యపై అనుమానం పెరగసాగింది.
Image result for arrest
ఆమె అందాన్ని చూసి కొందరు కామెంట్లు కూడా చేస్తుండడంతో ఆమెపై అసూయ, ద్వేషం పెంచుకున్నాడు. దాంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు.  ఈ నేపథ్యంలో రెండో భార్యను చంపేందుకు ఢిల్లీలోని ఓ మార్కెట్ లో కత్తిని కొన్నాడు. అయితే, అంతలోనే మనసు మార్చుకుని ఆమెను చంపడం కన్నా, వ్యభిచార గృహానికి అమ్మేస్తే తనకు డబ్బులు కూడా వస్తాయనుకున్నాడు.

అంతే తన ఆలోచనలకు పదును పెట్టాడు..తన భార్యకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఓ విటుడుకి తన భార్యలను రూ.1.20 లక్షలకు అమ్మడానికి ప్రయత్నించాడు..కానీ ఆ దుర్మార్గుడి పాపం పండింది.. ఆ విటుడు పోలీస్ ఇన్ ఫార్మర్ అని గ్రహించలేక పోయాడు.బలవంతంగా అతనికి అప్పగిస్తుండగా అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ మహిళను కాపాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: