జగన్ అంటే చంద్ర బాబుకు భయం అని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక భహిరంగ సభలో చెప్పినాడు. దానితో అందరూ నిజమే అనుకున్నారు ఎందుకంటే ఒక రాజకీయ ప్రత్యర్థి కి అంత సామాన్యంగా క్రెడిట్ ఇవ్వరు. అయితే ఇప్పడూ తాజాగా వైయస్ ఫ్యామిలీ లోని సభ్యులను కేసుల్లోకి లాగుతున్నారంటే వెనుక టీడీపీ హస్తం ఉందని చంద్ర బాబు ఎక్కడ జగన్ సీఎం అవుతాడని భయపడుతున్నాడని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
ఎప్పుడో ఏడేళ్ళక్రితం వైఎస్ జగన్ మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణ కొనసాగుతూనే వుంది. ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ న్యాయస్థానానికి హాజరవుతూనే వున్నారు. ఈడీ అటాచ్మెంట్లు వంటివి షరామామూలు వ్యవహారంగా మారిపోయాయి. గతంలో ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అవడం తెల్సిన విషయాలే. అయితే ఆయా కేసుల్లో చాలామందికి ఊరట లభించింది. ఇన్నేళ్ళలో ఈ కేసుకు సంబంధించి 'దోషి' అని ఏ న్యాయస్థానమూ నిర్ధారించలేదు.
చంద్రబాబుకి అటు కాంగ్రెస్ మద్దతువుంది, ఇటు బీజేపీ మద్దతూ వుంది. అయినాగానీ, వైఎస్ జగన్ అంటే ఆయనలో భయం ఏమాత్రం తగ్గలేదు. జగన్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. చిట్ట చివరి అస్త్రంగా వైఎస్ భారతిపై టీడీపీ అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు బురద జల్లించాలనుకుంటున్నారేమో.! అయితే, ఇది చిట్ట చివరి ప్రయత్నం కాబోదు.