ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ గా పెరుతెచ్చుకున్న రోజా తాజాగా టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలు పదే పదే తమ అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఘోరంగా దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని..వాళ్లు మగాళ్లో..ఆడాళ్లో అర్ధం కావడం లేదని విమర్శించారు.  ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలుగుదేశం నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సతీమణి భారతిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. 
Image result for tdp
పైకి బీజేపీ తో వైరం ఉందని..వారితో తెగదెంపులు చేసుకున్నామని మాట్లాడుతూనే లోపాయికార ఒప్పందాలు పెట్టుకుంటున్నారని..ఈ మద్య కాంగ్రెస్ తో కూడా జత కట్టారని అందుకే టీడీపీ నేతలు విర్రవీగిపోతున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఓ కేసులో ఏడు సంవత్సరాల తరువాత జగన్ భార్య భారతి పేరును చేర్చడమేంటని ప్రశ్నించిన ఆమె, ఓ కుట్ర ప్రకారం ఇదంతా జరుగుతోందని నిప్పులు చెరిగారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగితే వారు పడే ఆవేదన ఎలా ఉంటుందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   
Image result for ysrcp
ఏపీని దోచుకుంటున్న చంద్రబాబు, దాన్ని సింగపూర్ లో దాచుకుంటున్నారని విమర్శించారు. కొంత కాలాంగా తమ అధినేతపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులు వీగిపోతున్నాయని.. , ఈ విషయం తెలిసి తట్టుకోలేని చంద్రబాబు సర్కారు వైఎస్ భారతి పేరును తెచ్చి రాద్ధాంతం చేస్తోందని రోజా మండిపడ్డారు. పార్లమెంట్ లో వైసీపీ పెట్టిన అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాలయాపన చేసి, ఆపై టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై చర్చ చేపట్టారని, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏంటని ప్రశ్నించారు. 

తమ అధినేతపై అడ్డగోలుగా పెట్టిన కేసులు ఫోకస్ చేస్తున్నారే కానీ..ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబుని మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.  బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన సుజనా చౌదరి కూడా దర్జాగా తిరుగుతున్నారని, అటువంటి వారంతా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రోజా అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: