వామపక్షాలు, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ పేరు ప్రకటించనున్నారు. ఈ మేరకు రెండు పార్టీలు కలసి నిర్వహించే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ ఈ రోజు విజయవాడలో వెల్లడించారు. రానున్న ఎన్నికలను కూటమిగా ఎదుర్కొంటామని చెప్పారు.


బస్సు యాత్ర :


హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ బస్సు యాత్రను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం భారీ ఎత్తున కార్యక్రమాలను చెపట్టడంతో పాటు, జనాలకు చేరువ అయ్యేందుకు కూటమి తగిన కార్యాచరణ రూపకల్పన చేస్తుందని చెప్పారు. . రెపు విజయవాడలో జరిగే కీలక సమావేశంలో కూటమి నాయకులంతా పాల్గొంటారని అన్నారు.


15న మహా గర్జన :


కూటమి ఆద్వర్యంలో ఈ నెల 15వ్ విజయవాడలో మహా గర్జనను నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ గర్జన ఉంటుందని అన్నారు. మొత్తం మీద ఏపీలో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని  నిర్మిస్తామని కామ్రెడ్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: