రాజకీయ గండర గండడికే గుణపాఠం చెబుతామంటోంది కాషాయం పార్టీ. గుంటూర్ కారం రుచి చూపిస్తామని భారీ స్టేట్మెంట్లూ ఇస్తోంది. అయనను ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే ఎన్నికలలో ఓడించి తీరుతామని శపధం కూడా చేస్తోంది. మైకు ముందు ఇలా  లెక్చర్లు దంచుడు బాగానే ఉంది కానీ ఏపీలో ఉనికి పాట్లు పడుతున్న పార్టీకి అది సాధ్యమా...?


దొంగ దీక్షలన్న  కన్నా :


ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్నవన్నీ దొంగ దీక్షలేనని బీజేపీ అధ్యక్ష్దుడు కన్నా లక్ష్మీ నారాయణ  ఫైర్ అయ్యారు. శ్రీకాకుళంలో పార్టీ  మీటింగులో మాట్లాడిన ఆయన బాబుపై   విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులన్నీ తెచ్చేసుకుని ఇపుడు ప్లేట్   ఫిరాయింపా అంటూ గద్దించారు. తప్పుడు ప్రచారం చేస్తూ జనాలను తప్పు దోవ పట్టిస్తున్నారంటూ బాబుపై చెలరేగిపోయారు. కేంద్ర పధకాలకు తన పేర్లు పెట్టుకున్న తీరు దారుణమన్నారు. అన్నీ కలిపి ఎండగడతామని, ఈసారి సీఎం కుర్చీ దక్కనీయమని చాలెంజ్ చేశారు.


బాబుతోనే యుధ్ధమట :


ఏపీలో బాబుతోనే బీజేపీకి యుధ్ధమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర రావు స్పష్టం చేశారు. బాబు ఎంత మొత్తుకున్నా మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పేశారు. పోయిన ఎన్నికలలో మోడీ హవాతో గెలిచిన బాబు తమకే ఎగనామం పెట్టారంటూ ఓ రేంజిలో కామెంట్స్ చేశారు. నిజాయతి, విశ్వసనీయత లేని చంద్రబాబు ని ఇంటికి పంపుతామని చెప్పారు. . అసలైన యుధ్ధాన్ని శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టామని,  టీడీపీకి ఇక గడ్డు రోజులేనని ఆయన అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: