మొన్నటి వరకు జగన్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ మాత్రమే కాదు దేశ బడ్జెట్ కూడా సరిపోదని చాలా మంది వెటకారం చేశారు. టీడీపీ అయితే అవి అనుభవ రాహిత్యానికి నిదర్శనమని తనదైన శైలిలో విమర్శలు కురిపించింది. అయితే ఇప్పడూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒకే ఒక హామీతో టీడీపీ మైండ్ బ్లాక్ అవుతుందేమో...  ఏపీలో ప్రతి మహిళకు నెలకు 2500 నుంచి 3500 రూపాయల వరకు వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తాం. ఈ బృహత్తర కార్యక్రమం జనసేన మేనిఫెస్టోలో ఉంది" అంటూ తణుకు సభలో జనాలకు అరచేతిలో వైకుంఠం చూపించబోయారు జనసేనాని.


నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!

రాజకీయాల్లో నాకు అనుభవం లేదంటూనే.. బాగా అనుభవం ఉన్న వ్యక్తిలా అదిరిపోయే పథకాలను ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఈ నగదు బదిలీ ఆలోచన ఆయనకు ఎందుకొచ్చిందో కూడా సెలవిచ్చారు. రేషన్ బియ్యం తీసుకుంటున్న ఓ మహిళ తాము ఆ బియ్యాన్ని తినలేమని, అందుకే తిరిగి షాపులో అమ్మేస్తామని చెప్పిందట. దానికి చలించిపోయిన పవన్, నేరుగా డబ్బులే బ్యాంకులో వేస్తే.. వారు తినగలిగే బియ్యమే కొనుక్కుంటారని అనుకున్నారట. అలా ఆయన బుర్ర పాదరసంలా పనిచేసి మేనిఫెస్టోలో ఓ పాయింట్ చేర్చడానికి కారణమైందట. అదీ అసలు కథ.


నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!

పబ్లికి పాలసీల గురించి నాకంటే గొప్పగా ఎవరికీ తెలీదని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ దీనికి సమాధానం చెప్పితీరాల్సిందే. ఈలెక్క చూసుకుంటే జనసేన పూర్తి మేనిఫెస్టో రిలీజైతే రాజకీయ విమర్శకులకు బోలెడు పని దొరుకుతుందన్నమాట. రాజకీయాల్లో అవగాహన పెంచుకుంటున్నారు సరే.. కనీసం రాష్ట్ర బడ్జెట్, వాటి వాటాలు, జనాభా, లబ్ధిదారులు.. వీటిపైన కూడా పవన్ కల్యాణ్ అవగాహన పెంచుకుంటే మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: