భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా అంటే ఇప్పుడు రెండు దేశాల అభిమానులు మాట్లాడుకుంటారు.  ఎందుకంటే..పుట్టి పెరిగింది భారత దేశం..అయినా పెళ్లీ చేసుకుంది మాత్రం పరాయి దేశం అందునా భారత్ అస్సలు గిట్టని దేశం పాకిస్థాన్ కి చందిన క్రికెటర్ షోయబ్ మాలిక్.  తాజాగా సానియా మిర్జా ఓ నెటిజన్‌కు  ఘాటు రిప్లై ఇచ్చింది. 

ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నా పాకిస్థానీ అభిమానులు, మిత్రులకు స్వాతనత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని సానియా ట్వీట్ చేసింది. అయితే వెంటనే ఓ నెటిజన్ స్పందించి.. ‘‘మీక్కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అయితే, మీ ఇండిపెండెన్స్ డే కూడా ఈ రోజే కదా’’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన సానియా.. ‘‘కాదు, నాది.. నా దేశానిది రేపు.
Image result for sania mirza twitter
ఈ రోజు నా భర్తది, ఆయన దేశానిది. మరి మీదెప్పుడు?.. ఇప్పటికైనా స్పష్టత వచ్చిందనుకుంటా’’ అని ట్వీట్ చేసింది.  దాంతో ఆ నెటిజన్ కి సరైన జవాబు చెప్పిందని సానియా మిర్జాకు ప్రశంసలు అందుతున్నాయి.  తాజాగా సానియా మిర్జా ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: