వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ ని విమర్శించడంలో ముందుండే టిడిపి నాయకులలో దేవినేని ఉమా ఒకరు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భాలలో ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నలతో ఇరుకునపెట్టే సందర్భాలలో జవాబు లేని స్థితిలో ఉన్నా సమయంలో వెంటనే అసెంబ్లీలో దేవినేని ఉమా లెగిసి జగన్ లక్ష కోట్లు తిన్నాడు తండ్రి హయాంలో ప్రజలను దోచుకుతిన్నారు మర్డర్లు చేశారు….మూర్ఖుడు అని చాలా దారుణంగా ప్రభుత్వం చేసిన తప్పుని పక్కదోవ పట్టించి జగన్ని టార్గెట్ చేసేవారు.
ఈ క్రమంలో ఇలాంటి నీచమైన ఏపీ మంత్రి దేవినేని ఉమా కి రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి సరికొత్త ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగానే దేవినేనికి సరైన పోటీ వ్యక్తి వసంతను వైసీపీలో చేర్చుకున్నారు.
ఆర్థికంగా, వ్యాపార వేత్తగా స్థిరపడిన వసంత కృష్ణప్రసాద్ సామాజికంగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన నివాసానికి ఎవరైనా ఒట్టి చేతులతో వెళ్తే తిరిగి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి చేత పట్టుకు పోవాల్సిందే. ఇక ఆయన త్యాగాన్ని చూసిన ప్రజలందరు వసంత వెన్నంటి నడుస్తున్నారు. దీంతో మైలవరంలో వైసీపీ ఊపు మరింత పెరిగింది. ఇక ఇదే క్రమంలో వైసీపీ నాయకులు పార్టీ తరపున నియోజకవర్గంలో ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య నేతగా వైవీ సుబ్బారెడ్డి విచ్చేశారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన దిశా నిర్ధేశాలను చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వసంతాను గెలిపించి మైలవరంలో వైసీపీ పార్టీ జండా ఎగర వెయ్యాలని గట్టి పట్టుదలతో ఉన్నారు వైసిపి పార్టీకి చెందిన నాయకులు.