కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు..ఎంతో మంది ప్రమాదంలో చిక్కుకున్నారు.  కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. పలు జిల్లాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. 10 రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రమంతా చిగురుటాకులా వ‌ణుకుతోంది.  భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌టంతో ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌ను త‌ల‌పిస్తున్నాయి. ముఖ్య‌మైన న‌దుల‌న్నీ పొంగిపొర్లుతున్నాయి. వందేళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా కేర‌ళ‌లో వ‌ర్షాలు కురిసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ‌కు వ‌దిలేస్తున్నారు.  కేరళా ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీలు ముందుకు వస్తున్నాయి.   
Image result for కేరళ వర్షాలు
కేరళ రాష్ట్రానికి చేతనైనంత సాయం చేసేందుకు వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. సగటు పౌరుల నుంచి ప్రముఖుల వరకూ తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ప్రకృతి విలయానికి ధ్వంసమైన భూలోక స్వర్గంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ప్రార్థిస్తూ.. ఉడతా భక్తిగా సాయపడుతున్నారు.   భారీ వర్షాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కేరళ వాసులకు సాయం చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.  తెలంగాణ పాతికకోట్లు, ఆంధ్రా, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, బీహార్, హర్యానా రాష్ట్రాలు తలా 10 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించాయి.
Image result for కేరళ వర్షాలు
ఏపీ ప్రభుత్వం పదికోట్ల సాయంతో పాటు విపత్తు నిర్వహణ దళాన్ని కూడా కేరళకు పంపింది. ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలు తలా ఐదేసి కోట్ల రూపాయలు ప్రకటించగా..  పుదుచ్చేరి రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.   తమిళ స్టార్హీరో విజయ్.. కేరళ వరద బాధితుల కోసం 14 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. భారీ వరదలతో అల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ముందుకొచ్చింది.. కేరళ వరద బాధితుల సహాయార్థం చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష రూపాయల విరాళాన్ని ప్రటించారు.   
Image result for కేరళ వర్షాలు
మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా 25 లక్షల విరాళాన్ని కేరళకు ప్రకటించగా ఆయన తనయుడు రాంచరణ్ 25 లక్ష విరాళాన్ని ప్రకటించారు.. రాంచరణ్ సతీమణి ఉపాసన 10 లక్షల విరాళాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా 10లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.  మరోవైపు కేరళలో ప్రకృతి ప్రకోపానికి రహదారులు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు గ్రామాలు నీటమునగడంతో ఎయిర్ లిఫ్ట్ విధానం ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 4వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించగా 1, 764 మందిని రక్షించారు. చాలా మార్గాల్లో రైలు స‌ర్వీసుల‌ను నిలిపివేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: