ఆయన ఓ మత బోధకుడు..పాపం పుణ్యం గురించి వేల మందికి హితబోద చేసేవాడు..కానీ కామందుడైన ఓ చిన్నారిపై అత్యాచారం చేశాడు.  భారత దేశంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..కామాంధులను మాత్రం అరికట్టలేని పరిస్తితి దాపురించింది. తాజాగా  ఓ పాస్టర్ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు.  15 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్లి 3 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ పర్లోవపేటలో హౌస్ ఆఫ్ సాల్వేషన్ ప్రార్థనా మందిరంలో పాస్టర్‌గా తాతాపూడి జాషువా నిహాల్ (54) పనిచేస్తున్నాడు. తన కూతురు ఆరోగ్యం బాగాలేక పోవడంతో  తన పదిహేనేళ్ల కూతురితో ఓ తల్లి పాస్టర్ వద్దకు వచ్చింది.  పదిహేనేళ్ల బాలికను చూడగానే ఆ పాస్టర్ కి కామంతో కళ్లు మూసుకు పోయాయి..తాను పది మందికి ఆదర్శం అన్న విషయం..ఉచ్ఛనీచాలు మరిచి పోయాడు.

పాస్టర్ ఈ అమ్మాయి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలంటూ మాయమాటలతో నమ్మించాడు. రామారావుపేటలో నివాసం ఉంటున్న తన ఇంటికి బాలికను రప్పించుకొని 3 నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా ఆ ప్రభువు నిన్ను కఠినంగా శిక్షిస్తాడని...నరకానికి పోతావని బెదిరించాడు. వారం క్రితం బాలిక ఈ దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న పాస్టర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని డీఎస్పీ రవివర్మ తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: