వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు జగన్.

Image may contain: one or more people, crowd and outdoor

ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేసారు. గత ఎన్నికలలో చంద్రబాబు అనేక పార్టీలను పెళ్లి చేసుకుని ప్రస్తుతం వస్తున్నా ఎన్నికలకు గతంలో పెళ్లి చేసుకున్న పార్టీలను వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు.

Image result for chandrababu

అంతే కాకుండా ఇంకా జగన్ మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ఐదున్నరకోట్ల ప్రజలను ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అధికారం కోసం ఆరువందల అబద్ధపు హామీలను కురిపించారు.

Image may contain: 16 people, people smiling, crowd and outdoor

అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్న కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిగ్గులేకుండా పాలిస్తున్నాడు. బాబుకు సిగ్గులేని చంద్రబాబు అనే బిరుదునివ్వచ్చు అని ఆయన సరికొత్త బిరుదునిచ్చారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని కొత్తగా పెళ్లి చేసుకుందామని చంద్రబాబు రెడీ అయిపోయారని సెటైర్లు వేస్తూ మాట్లాడారు జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి: