భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా బీహార్ భోజ్ పూర్ జిల్లాలోని బహియా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళపై  దారుణంగా దాడి చేశారు.  అంతే కాదు అందరూ చూస్తుండగానే ఆమెను నగ్నంగా ఊరేగించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దామోదర్ పూర్ కు చెందిన విమలేష్ షా అనే వ్యక్తి సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు.మృత దేహం సమీపంలోని రైల్వే స్టేషన్ స్టేషన్ వద్ద కనిపించింది.
Image result for మహిళా నగ్నంగా ఊరేగింపు
విమలేష్ మృతి చెందిన ప్రాంతానికి దగ్గర్లోనే రెడ్ లైట్ ఏరియా ఉంది..దాంతో రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళ కుటుంబమే కారణం కావచ్చని గ్రామస్తులు భావించారు.  దాంతో అక్కడ ఉన్న మహిళలను తీసుకు వచ్చి ఆమెను దారుణంగా హింసించి..స్త్రాలను తొలగించి, నగ్నంగా ఊరేగించారు. అంతేకాదు, ఆమె ఇంటికి, అక్కడున్న ఒక మోటార్ బైక్ కు నిప్పంటించారు.
Image result for rape image
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి, మూకను చెదరగొట్టారు. భారీ ఎత్తున బలగాలను దింపి, అల్లర్లను అదుపులోకి తెచ్చారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అలసత్వం వహించిన 8 మంది పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: