తెలంగాణలో గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో భారీ ఎత్తున డ్రగ్స్ ముఠా పట్టుబడ్డ విషయం తెలిసిందే. డ్రగ్స్ కి పెద్దవారే కాదు...చిన్న పిల్లలు కూడా బానిసైలనట్లు భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఈ డ్రగ్స్ ముఠా సభ్యులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రామాంతాపూర్ లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పటిష్ట నిఘా పెడుతున్నా డ్రగ్స్ ముఠాలు చాకచక్యంగా పట్టుకున్నారు.
పెద్ద ఎత్తున డ్రగ్స్ తెస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. పది గ్రాముల హెరాయిన్ , 15 LSD బ్లాట్స్, 1.5 కేజీల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిటీలో డ్రగ్స్ ముఠాలకు చెక్ పెడుతున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. తమ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు.
ఇటీవలే గంజాయి చాకెట్లు, కొకైన్ డ్రగ్స్ ను పట్టుకున్న ఎక్స్సైజ్ పోలీసులు.. తాజా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రదేశాల నుంచి తెచ్చిన మత్తు పదార్థాలు..తీసుకువచ్చి విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, కూలీలకు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు.