పాఠాలు చెబుతూ విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీలైనప్పుడల్లా ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమెను గర్భవతిని చేశాడు. గర్భం పోగొట్టడానికి మాత్రలు కూడా ఇచ్చాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టూటౌన్ ప్రాంతంలోని శర్వాణి పబ్లిక్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న బాలికపై ఇంగ్లీష్ టీచర్ రాంబాబు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక గర్భవతి కావడంతో అబార్షన్ కోసం తానే మందులిచ్చాడు. ఆ మందులు కాస్త వికటించడంతో బాలిక పరిస్థితి విషమించింది..దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణం ఉపాధ్యాయుడని తెలుసుకున్న బంధువులు, స్థానికులు అతని ఇంటికెళ్లి బయటికి లాక్కొచ్చారు.
బట్టలూడదీసి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో నగ్నంగా ఉన్న టీచర్ను ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.